దేశంలో కమ్యూనికేషన్ రంగంలో విశిష్టమైనది టెలి కమ్యూనికేషన్ సంస్థ. మారుమూల ప్రాంతాలు మొదలుకొని, దేశ సరిహద్దు ప్రాంతం వరకు సేవలను విస్తరించిన సంస్థ బీఎస్ఎన్ఎల్. దేశంలో 7.5 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కలిగి ప్రజలకు అతి చౌకగా సేవలందిస్తున్నది. టెలికాం రంగంలో 118 కోట్ల మొబైల్ చందాదారుల ను కలిగి ప్రపంచంలోనే రెండవదిగా ఉన్నది. 75 కోట్ల మంది ఇంటర్నెట్ చందాదారులను కలిగి ఉన్నది. ప్రపంచంలో మిగ తా కంపెనీలతో పోలిస్తే అతి చౌకగా డేటాను అందిస్తున్న సంస్థ బీఎస్ఎన్ఎల్. గ్రామీణ ప్రాంతాల్లోనే సుమారు 18 వేల టెలిఫోన్ ఎక్సేంజీలు గల ఏకైక సంస్థ ఇది. తన సేవల ద్వారా వచ్చిన సంపాదనతోనే సంస్థకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిస్తున్నది.
ఇలాంటి పరిస్థితుల్లో బీఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించి ఇంటికి పంపుతూ సేవల నాణ్యతను నీరుగారుస్తున్నది. మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ఎర్ర తీవాచీ పరుస్తున్నది. ఈ విధానం కొనసాగితే ప్రజలకు చౌకగా లభించే టెలి కమ్యూనికేషన్ సేవల ధరలు పెరిగే అవకాశం ఉన్నది. రైల్వేల నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం మెల్లమెల్లగా వైదొలగిన తర్వాత టికెట్ ధరలు, యూజర్ చార్జీలు పెరిగినట్లే, టెలికం సేవలు కూడా సామాన్య ప్రజలు పొందలేని స్థితి నెలకొనటం ఖాయం.
– ఆళవందార్ వేణుమాధవ్
86860 51752