న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ సీఈఓ, ఎండీ రవి నరైన్ను (Ravi Narain) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. అప్రకమంగా ఫోన్ట్యాపింగ్ చేసిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలకు సంబంధించి విచారణలో సహకరించపోవడంతో అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. రవి నరైన్ 1994 నుంచి 2013 వరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (National Stock Exchange) సీఈవోగా, ఎండీగా వ్యహరించారు. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరిలో 2013, ఏప్రిల్ 1 నుంచి 2017, జూన్ 1 వరకు వైస్ చైర్మన్గా పనిచేశారు.
ఈ క్రమంలో సంస్థ ఉద్యోగుల ఫోన్లను ట్యాప్చేశారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఇదే కేసులో ఇప్పటికే ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేను ఈడీ అరెస్టు చేసింది. ఎన్ఎస్ఈ సర్వర్ల కో-లొకేషన్ కేసులో ఎన్ఎస్ఈ మరో మాజీ ఎండీ, సీఈఓ చిత్ర రామకృష్ణకు ఈ కేసుతో సంబంధం ఉన్నది. ఇప్పటికే ఆమెను అధికారులు విచారించారు.