న్యూఢిల్లీ : ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రాగా.. ఆయనను కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారని ఆయన సోదరుడు ప్రణబ్ సేన్ పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో అభిజిత్ సేన్ దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రాన్ని బోధించారు. కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ చైర్మన్తో పాటు పలు పదవుల్లోనూ పని చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో 2004-2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ విశేష సేవలందించారు.