హైదరాబాద్, సెప్టెంబర్ 28: లాజిస్టిక్ సేవల సంస్థ ఈకామ్ ఎక్స్ప్రెస్.. తాజాగా హైదరాబాద్లో తన తొలి గిడ్డింగిని ప్రారంభించింది. దక్షిణ భారతంలో సంస్థకిది ఆరో గిడ్డంగి. కాగా, దేశంలో ఇది 55 కావడం విశేషం.
హైదరాబాద్కు సమీపంలోని మేడ్చల్ వద్ద 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్తో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సెంటర్తో హైదరాబాద్లోని కస్టమర్లకు వేగవంతంగా సేవలు అందించడానికి వీలు పడనున్నదని కంపెనీ కో-ఫౌండర్, డైరెక్టర్ కే సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో వ్యాపారాన్ని విస్తరించడానికి కట్టుబడి ఉన్నట్లు, ముఖ్యంగా టెక్నాలజీ, డిజైనింగ్, సొల్యుషన్స్, లాజిస్టిక్, మౌలిక సదుపాయాలను మరింత ఆధునీకరించడానికి పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు.