హుజూరాబాద్ : గత 20 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. కానీ వావిలాల మండలం చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఈటల. దళితుల భూమి దొంగతనంగా తీసుకోవడం వల్ల పార్టీ నుంచి వెలివేయబడిన ఈటలకు మా గ్రామంలో ఓటుబ్యాంక్ లేదు. మీకు ఎవరూ ఓటు వేయరు. మా గ్రామంలో జరిగిన అభివృద్ధి నీవు చేసింది కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వారా జరిగింది.
రైతుబంధు మొదలు కొని అన్ని రకాల పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవే. నీవు ఆస్తి సంపాదించుకున్నవే కానీ ప్రజల మనసులు గెలుచుకోలేదు. నీవు ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నావు కదా! నిజంగా నీకు ఆత్మగౌరవం ఉంటే మందు పంచుడు, గొడుగులు పంచుడు చేయవు. మండలం చేస్తానని మాట తప్పిన నీవు అభివృద్ధి చేస్తావని నమ్మకం ప్రజలకు లేదు. నీకు ఆత్మగౌరవం ఉంటే ఇంట్లో ఉంటే గెలుస్తవు.కానీ నీకు అది లేదు.
ప్రలోభాలతో గెలుస్తావనుకుంటే గ్రామంలో అడుగు పెట్టనివ్వము. ప్రభుత్వంతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ కే ఓటు వేస్తారు. దళితుల చేత కాళ్లు కడిగించుకున్నపుడే దళితుల మీద నీకున్న ప్రేమ తెలిసింది. ఖచ్చితంగా మేం అంద రం టీఆర్ఎస్ వైపే నిలుస్తం. నిన్ను పార్టీలోకి తీసుకువచ్చిన వారు అలాగే ఉన్నారు. కానీ నీవు కోట్లు సంపాదించావు.
నీ అవినీతి ప్రజలందరూ గుర్తించారు. నీకు మంత్రిపదవి ఇచ్చిందే కేసీఆర్ కానీ ముఖ్యమంత్రి పదవిమీదనే కన్ను వేశావు. ఈ రోజు నీతో ఎవరూ లేరంటనే నీ ఓటమి ఖాయమని గుర్తు పెట్టుకో.
-గొర్ల సతీష్ యాదవ్, వావిలాల గ్రామం. జమ్మికుంట మండలం
గెల్లు శ్రీనివాస్ను గెలిపించుకుంటం.
తెలంగాణ వచ్చిన తర్వాతే కేసీఆర్ కిట్టు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు ఇట్ల చాలా పథకాలు చేసిండు. తెలంగాణ ఎంతో అభివృద్ది సాధించింది. అందుకే మనమంతా కేసీఆర్ వెంటే ఉండాలి. ఇంకా అభివృద్ధి సాధించాలంటే మన గెల్లు శ్రీనివాస్ను గెలిపించుకోవాలని కోరుతున్నాను.
వలీ చిన్న, ఖాసీంపల్లి ,కమలాపూర్.
సాయం చేసిన ప్రభుత్వానికే ఓటు
మొన్నవ చ్చిన వర్షాలకు ఇండ్లండ్లకు నీళ్లు వచ్చినయి. బియ్యం, బట్టలు అన్ని తడిచినయి. గోడలు కూలుతాయని భయపడి పక్క ఇంటిలో పడుకున్నం. తెల్లారి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చిండ్లు. ఇల్లు చూసిన్రు. అన్ని అడిగి రాసుకున్నరు. 3,800 చెక్కు ఇచ్చిన్రు. అంతకు మునుపు ఎవరూ రాకపోయేది. ఇంకా అభివృద్ధి చేస్తే టీఆర్ఎస్ కే ఓటేస్తం. ఆర్థికసాయం అందించిన ప్రభుత్వానికే అండగా ఉంటం.
గిన్నారపు రాజమ్మ, గాంధీనగర్, హుజురాబాద్ టౌన్.