హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): నెల్లూరు జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వింజమూరు, దు త్తలూరు, వరికుంటపాడు మండలాల్లో 3 సెకండ్లపాటు భూమి కంపించింది. ప్రకాశం జిల్లా పామూరులోనూ రెండు సెకండ్లపాటు భూప్రకంపనలు వచ్చాయి. దాంతో భయంతో ఇండ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు.