పోర్ట్ బ్లెయిర్ : అండమాన్ నికోబార్ దీవులను భూకంపాలు వణించాయి. మంగళవారం ఉదయం మూడు గంటల వ్యవధిలో నాలుగుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయభాంత్రులకు గురయ్యారు. మొదట ఉదయం ఉదయం 6.27 గంటల సమయంలో రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. క్యాంప్బెల్ బేకు 235 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.
ఆ తర్వాత రిక్టర్ స్కేల్పై 4.6 తీవ్రతతో భూమి కంపించింది. మరోసారి ఉదయం 9.12 గంటలకు రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అండమాన్ దీవులకు 310 కిలోమీటర్ల దూరంలో భూమికి 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎస్సీఎస్ తెలిపింది. అనంతరం 9.13 గంటలకు మరోసారి రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూమి కంపించింది. వరుస భూకంపాలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇప్పటి వరకు నష్టానికి సంబంధించిన ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.