హైదరాబాద్: బీఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయింది. ఈ మేరకు ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ను టీఎస్ ఎంసెట్ విడుదల చేసింది. డిసెంబర్ 1 నుంచి 3 వరకు స్లాట్బుక్ చేసుకోవాలని, 3, 4 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. డిసెంబర్ 3 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాలని, డిసెంబర్ 7న బీఫార్మసీ, ఫార్మ్ డీ తొలి విడత సీట్లను కేటాయిస్తామని అధికారులు చెప్పారు. 7 నుంచి 10 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలన్నారు.
డిసెంబర్ 13 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. 13న స్లాట్ బుకింగ్, 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. డిసెంబర్ 17న తుది సీట్లను కేటాయిస్తామని చెప్పారు. సీట్లు పొందినవారు 17 నుంచి 19 వరకు ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలన్నారు. డిసెంబర్ 18 నుంచి 20 మధ్య విద్యార్థులు తమకు కేటాయించి కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. డిసెంబర్ 19న స్పాట్ అడ్మిమిషన్ ఉంటుందని వెల్లడించారు. పూర్తివివరాలకు https://tseamcetb.nic.in/లో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.