సంగారెడ్డి : హరితహారంలో ప్రతి ఉద్యోగి పాల్గొని 5 మొక్కలు నాటాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. బుధవారం టీఎన్జీవో భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలపై అభిమానంతో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో మార్చి 22న చర్చలు జరిపారని 9 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ లతో సహా ఇతర ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో కూడిన పీఆర్సీ ప్రకటించడం హర్షణీయమన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇది మొట్టమొదటి పీఆర్సీ అన్నారు.
2018 నుంచి రావాల్సిన 11 వ పీఆర్సీ కరోనా వల్ల ఆలస్యం అయిందని తెలిపారు. పీఆర్సీ ప్రకటించడంతో ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. క్వాంటం ఆఫ్ పెన్షన్ రూ. 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచారని వివరించారు.
కరోనాతో చనిపోయిన వారి ఉద్యోగ కుటుంబాలకు కారుణ్య నియామకం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో స్పీడ్ అప్ స్ట్రెంగ్త్ పెంచాలని పేర్కొన్నారు.
ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని సీఎం కేసీఆర్ని కోరామన్నారు. గచ్చబౌలిలో 200 ఏకరాలలో ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. ప్రతాప్, అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, జిల్లా అధ్యక్షుడు సుశీల్ బాబు, కార్యదర్శి నర్సింలు, సభ్యులు రవి, వెంకటరెడ్డి, శ్రీకాంత్, సిద్దిరాం, శ్రీనివాస్, గాజ్ హష్మీ, జనార్ధన్, జి. శ్రీనివాస్, రాజకుమారి, సుధామణి, భాస్కర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బైక్ను ఢీ కొట్టిన కారు..ఎనిమిదేండ్ల బాలుడు మృతి
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి