తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మీనలగ్నంలో సాయంత్రం 5.10గంటల నుంచి 5.30 గంటల మధ్య శాస్త్రోక్తంగా రుత్వికులు ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం మీదకు గరుడ పతాకం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. రాత్రి 8.30గంటల నుంచి 9.30 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగనుంది. వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలు, తీరొక్క పూలతో అలంకరించింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.