జోగులాంబ : అక్టోబర్ 7వ తేదీ నుంచి జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ రవి ప్రకాశ్ గౌడ్, ఈఓ వీరేశం తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లు, ఆహ్వానపత్రికలను ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. శరన్నవరాత్రి వేడుకలు 7న ప్రారంభమై.. 15న దసరాతో ముగుస్తాయని తెలిపారు.
7న సాయంత్రం ధ్వజారోహణం, 12న అమ్మవారి కల్యాణం, 13న దుర్గాష్టమి సందర్భంగా సింహవాహన సేవ, 15న విజయ దశమి సందర్భంగా జోగులాంబ అమ్మవారి రథోత్సవం, సాయంత్రం శమీపూజ, నదీ హారతి, రాత్రి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు వెంకట్రామయ్య శెట్టి, నాగరాజు, మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ, వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్, అర్చకులు విక్రాంత్ శర్మ, వెంకటకృష్ణ శర్మ పాల్గొన్నారు.