తక్కువ గ్యాప్లోనే సీతారామం, చుప్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఈ స్టార్ హీరో డ్రీమ్ ప్రాజెక్టు మరోసారి హెడ్లైన్స్లో నిలిచింది. దుల్కర్ స్నేహితుడు అభిలాష్ జోషి దర్శకత్వంలో రాబోతున్న కింగ్ ఆఫ్ కోట (King Of Kotha) చిత్రాన్ని గతేడాది ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా అప్డేట్ వచ్చేసింది.
ఈ చిత్రం ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ చెన్నైలోని రాయపురంలో ప్రారంభమైంది. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ హోం బ్యానర్ వఫరెర్ ఫిలిమ్స్పై నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ క్రేజీ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కూడా నటిస్తుండగా..వారి వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.
షాన్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ ప్రేమకథ నేపథ్యంలో వచ్చిన సీతారామం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్టందుకుంది. కొత్తదనంతో కూడిన సినిమాలు చేసే జాబితాలో ముందువరుసలో ఉంటాడు దుల్కర్ సల్మాన్.
ఈ హీరో రాజ్-డీకే దర్శకత్వంలో కామెడీ క్రైం థ్రిల్లర్గా తెరకెక్కుతున్న గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ చేస్తుండగా..షూటింగ్ పూర్తయింది. వెబ్ సిరీస్ లో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు, శ్రేయో ధన్వంతరీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
.@DulQuer’s period action drama #KingOfKotha goes on floors today. #DulquerSalmaan pic.twitter.com/bxx26kkAYj
— Suresh Kondi (@SureshKondi_) September 26, 2022