కింగ్ కోబ్రా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పం. ఇది కాటు వేస్తే క్షణాల్లో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి విషసర్పం ఓ మనిషిని కాటు వేసి మృతి చెందింది. ఇదేంటి కింగ్ కోబ్రా మనిషిని కాటువేసి మరణించడమేంటి అని
అనుకుంటున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఫుల్గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఖుషినగర్ జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చాడు. వైద్యుల వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. కింగ్ కోబ్రా తనని రెండు సార్లు కాటు వేసిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే అది చనిపోయిందని వివరించారు. వైద్యులను నమ్మించేందకు చనిపోయిన కింగ్ కోబ్రాను కవర్లో వేసి తన వెంట తీసుకొచ్చి వైద్యులకు చూపించాడు. ఈ ఘటనతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. అనంతరం సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు.