ముంబై: ఒక ప్రయాణికుడు విమానంలో మద్యం సేవించి రగడ సృష్టించాడు. దీంతో ఆ విమానాన్ని ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దోహా-బెంగళూరు విమానంలో కేరళకు చెందిన ప్రయాణికుడు సర్ఫుద్దీన్ ఉల్వార్ మద్యం తాగాడు. వారించిన ఎయిర్ హోస్టెస్తో అసభ్యంగా ప్రవర్తించాడు. జోక్యం చేసుకున్న తోటి ప్రయాణికులతో ఫైటింగ్కు దిగాడు. దీంతో విమానంలోని మిగతా ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
అనంతరం విమానంలో రగడ సృష్టించిన సర్ఫుద్దీన్ ఉల్వార్ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ పోలీసులకు అతడ్ని అప్పగించారు. దీంతో ఉల్వార్పై విమాన చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు అతడ్ని కోర్టులో హాజరుపర్చారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో సర్ఫుద్దీన్ ఉల్వార్ను రిమాండ్ కోసం జైలుకు తరలించారు.