అమరావతి : ఏపీలో డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతుంది. విశాఖ పోలీసులకు అందిన సమాచారం మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు లవర్ కోసం డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న యువతి పోలీసులకు పట్టుబడడంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం కేసులో నలుగురు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురిని పట్టుకున్నామని విశాఖ పోలీసు అధికారులు వెల్లడించారు.
మర్రిపాలెం గ్రీన్ గార్డెన్స్ ఏరియాకు చెందిన యువకుడు, హైదరాబాద్ యువతిని అరెస్టు చేశారు. హేమంత్కుమార్ , మాలవ్య, పృథ్విరాజ్ను పట్టుకున్నామని వివరించారు. గీత అనే మరో మహిళ కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీరివద్ద నుంచి . టాబ్లెట్ రూపంలో ఉన్న 18పిల్స్ , 2 ఎండీఎంఏ స్వాధీనం ఆడి కారు, నాలుగు మొబైళ్లను, రూ. 20,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో పిల్ విలువ రూ.15వందల వరకు ఉంటుందని వెల్లడించారు. మాలవ్యకు డ్రగ్స్ వాడకం లేదని తెలిపారు. వీరిపై డ్రగ్స్ నిరోధక చట్టం కింద పలు కేసులను నమోదు చేశామని తెలిపారు.