ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో దారుణం చోటుచేసుకుంది. డ్రగ్స్కు బానిసైన యువకుడు(22) యాచకురాలి ఏడేండ్ల కుమార్తెను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలిక తల్లి నిందితుడి మధ్య పరిచయం ఉందని పోలీసులు వెల్లడించారు.
బాధిత బాలిక ఆదివారం కుర్లా ప్రాంతంలోని తన ఇంటి వెలుపల ఆడుకుంటుండగా ఆమెకు చికెన్ రైస్ తినిపించేందుకు తీసుకువెళతానని బాలిక తల్లిని కోరగా అందుకు అంగీకరించింది. కొద్దిదూరం నడిచిన తర్వాత బాలికను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకువెళ్లాడు.
ఆమెను ఆరే కాలనీలోని యూనిట్ నెంబర్ 32కు తీసుకువెళ్లాడు. డ్రగ్స్కు బానిసైన నిందితుడు అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు విన్న స్ధానికులు ఆమెను కాపాడి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. గతంలో ఓ దాడి కేసులో నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.