గాయం కారణంగా విశ్రాంతి తీసుకొని భారత జట్టులో పునరాగమనం చేసిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఆస్ట్రేలియాతో రెండు మ్యాచులు ఆడాడో లేదో మళ్లీ వెన్నునొప్పితో జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతను వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కూడా ఆడటం కష్టమేనని, అవసరమైతే వెన్నుగాయానికి శస్త్రచికిత్స చేయించాల్సి రావొచ్చని వార్తలు వచ్చాయి.
వీటిపై స్పందించిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. అప్పుడే ప్రపచంకప్ నుంచి బుమ్రా పేరు కొట్టిపారేయొద్దని సూచించాడు. ‘ప్రపంచకప్ మొదలవడానికి ఇంకా సమయం ఉంది. అప్పుడే ఈ విషయంలో తొందరపడకండి’ అని గంగూలీ చెప్పాడు. వెన్నునొప్పి కారణంగా యూఏఈలో జరిగిన ఆసియా కప్లో కూడా బుమ్రా ఆడలేదన్న సంగతి తెలిసిందే. అవసరమైతే బుమ్రాను లండన్ పంపించి, అక్కడే మెరుగైన వైద్యం అందించాలని బీసీసీఐ భావిస్తోంది.
అతనికి అక్కడ శస్త్రచికిత్స జరిగితే నాలుగు నుంచి ఆరు నెలలపాటు క్రికెట్కు దూరమవుతాడు. అంటే ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండదు. ఇదే జరిగితే పొట్టి ప్రపంచకప్ ముందు భారత జట్టు కోల్పోయిన రెండో కీలకమైన ఆటగాడిగా బుమ్రా నిలుస్తాడు. కొన్నిరోజుల క్రితం మోకాలి గాయంతో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
🚨 UPDATE 🚨
Jasprit Bumrah complained of back pain during India's practice session on Tuesday. The BCCI Medical Team assessed him. He is ruled out of the first #INDvSA T20I.#TeamIndia
— BCCI (@BCCI) September 28, 2022
🚨 NEWS 🚨: Mohd. Siraj replaces injured Jasprit Bumrah in T20I squad. #TeamIndia | #INDvSA
More Details 🔽https://t.co/o1HvH9XqcI
— BCCI (@BCCI) September 30, 2022