న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల పెరుగుదల మరికొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. గత నెల నాలుగో తేదీన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కేంద్ర చమురు సంస్థలు ధరలను పెంచలేదు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక గత నెల 17 నుంచి పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు నూతన రికార్డులు నెలకొల్పాయి.
ఆల్ టైం రికార్డులు నెలకొల్పిన తర్వాత వరుసగా రెండో రోజు మంగళవారం (జూన్ 1) తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ క్రూడ్ మార్కెట్కు అనుగుణంగా దేశీయంగా చమురు ధరలు పెరిగే సంగతి అందరికీ తెలిసిందే.
గ్లోబల్ ఎకానమీ కోలుకుంటుందన్న సంకేతాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిపోతాయని చాయిస్ బ్రోకింగ్ అనలిస్ట్ రాజ్నాథ్ యాదవ్ చెప్పారు. చమురుకు డిమాండ్ పెరిగితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతాయి.. దాని ప్రభావం దేశీయ మార్కెట్ ధరలపై పడుతుందన్నారు.
మంగళవారం గ్లోబల్ అయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 1.24 శాతం పెరిగి బ్యారెల్ ముడి చమురు ధర 70.18 డాలర్లకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర సోమవారం రూ.100.72కు చేరుకున్నది. లీటర్ డీజిల్ ధర రూ.92.69 వద్ద నిలిచింది.
పెట్రోల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు 60 శాతం వరకు, డీజిల్పై 54 శాతానికి పైగా విధించాయి. ఇందులో లీటర్ పెట్రోల్పై రూ. 32.90, లీటర్ డీజిల్పై రూ.31.80 కేంద్ర ప్రభుత్వ సుంకాలే ఉన్నాయి.
పెట్రోలియం ఉత్పత్తులపై ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉంటే లీటర్ పెట్రోల్ ధర రూ.100దిగువకు వచ్చేస్తుంది. దేశ ద్రవ్య పరిస్థితుల ద్రుష్ట్యా ఇది ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశీయంగా పన్ను వసూళ్లు మెరుగు పడితే ప్రభుత్వం చేసే రుణాలు తగ్గుతాయి. అది రూపాయి విలువకు స్వల్పకాలికంగా పాజిటివ్గా నిలుస్తుంది.
భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూపాయి, అమెరికా డాలర్ ఆధారంగా ఖరారవుతాయి. ఒకవేళ డాలర్ బలహీన పడితే స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయి. కమొడిటీ ధరల్లో అనిశ్చితి ఉంటే, ముడి చమురు ధర బ్యారెల్కు 80 డాలర్లకు చేరుతుంది.
2015 ఇరాన్ అణ్వస్త్ర ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభమైతే గానీ పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టవని చాయిస్ బ్రోకింగ్ అనలిస్ట్ రాజ్నాథ్ యాదవ్ చెప్పారు.ప్రస్తుతం బ్యారెల్పై రూ.70 పలుకుతున్న ముడి చమురు ధర 60-70 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు.
దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకాలు ఇవ్వండి.. కోవిడ్ నుంచి కోలుకుంటూ కేంద్రానికి థరూర్ విజ్ఞప్తి
ఆన్లైన్ క్లాస్ వినాలంటే ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే
22 కోట్ల కోవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేయనున్న ముంబై కంపెనీ
మరో వైరస్ కలకలం.. దేశంలో తొలిసారిగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు గర్తింపు
అంబులెన్సుల దందా.. 40 కి.మీటర్లకు రూ.17 వేలు
న్యూయార్క్ కన్నా ముంబైలో రెట్టింపు!
రాందేవ్ బాబా దేశ వ్యతిరేకి : ఐఎంఏ
ఎస్పీఎస్ఎన్ లో 11 జూన్ నుంచి అతిపెద్ద అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్స్ లైవ్..