ములుగు : కరోనా పాజిటివ్ గర్భిణికి వైద్యులు కాన్పు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వాజేడు మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పాయం కుమారి అనే నిండు గర్భిణి ఇటీవల కరోనా బారిన పడింది. కాగా, ప్రసూతి సమయం దగ్గర పడటంతో అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు ములుగు ప్రభుత్వ దవాఖానకు రెఫర్ చేశారు.
108 అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా ఏటూర్ నాగారం సమీపంలోకి రాగానే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108 సిబ్బంది ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు. దవాఖానలోని వైద్యులు ఆమెకు కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఙలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వైద్య రంగం మరింత బలోపేతం : ఎమ్మెల్సీ కవిత
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి