ఒకటి కాదు.. రెండు కాదు.. ఓ మహిళ కడుపులో నుంచి ఏకంగా 47 కిలోల కణతిని డాక్టర్లు తొలగించారు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఇంత పెద్ద కణతిని తొలగించింది లేదు. 56 ఏళ్ల మహిళ గత 18 ఏళ్ల నుంచి కడుపులో గడ్డతో బాధపడుతోంది. గత కొన్ని నెలల నుంచి మంచానికే పరిమితం అయింది. దానికి కారణం.. అది పెద్ద సైజ్లో పెరగడమే.
ఆ కణతి ఏకంగా 47 కిలోలు పెరగడంతో తను లేవలేకపోయింది. ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది. సోనోగ్రఫీలో తన కడుపులో పెద్ద కణతి ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు.. రెండేళ్ల కిందనే ఆపరేషన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ.. తన సర్జరీ సక్సెస్ కాలేదు. కణతి.. తన శరీరంలోని అవయవాలకు అంటుకొని ఉండటంతో దాన్ని బయటికి తీయలేకపోయారు. సర్జరీని ఆపేశారు.
దీంతో దాని బరువు మరింత పెరిగింది. చివరకు ఇటీవల మళ్లీ ఆపరేషన్ చేసి 47 కిలోల బరువు ఉన్న కణతిని తన శరీరంలో నుంచి తొలగించారు. దీంతో ఆ మహిళ బరువు ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. గతంలో 52 ఏళ్ల మహిళ కడుపులో నుంచి ఢిల్లీలో 50 కిలోల కణతిని తొలగించారు.