గత రెండు మూడు రోజులుగా జిన్నా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు మీడియా ముందుకు వస్తున్నాడు. అయితే ఆ సినిమా కంటే ఎక్కువగా తనపై జరుగుతున్న ట్రోల్స్ విషయంలోనే స్పందిస్తున్నాడు మంచు విష్ణు. అందులో భాగంగానే తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేశారని.. కావాలనే తమపై ట్రోల్స్ చేయిస్తున్నారు అంటూ మంచి విష్ణు ఆరోపించడం సంచలనంగా మారింది. అందులోనూ జూబ్లీహిల్స్ లో ఉండే ఒక ప్రముఖ నటుడు తమపై కక్షగట్టి.. మా ఎలక్షన్స్ నుంచి కావాలని ట్రోల్స్ చేస్తున్నాడు అంటూ మీడియా ముందు విష్ణు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దాంతో ఎవరు ఆ ప్రముఖ నటుడు అంటూ గూగుల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. అందులో భాగంగా కొందరికి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. ఒక ప్రముఖ నటుడు అన్నాడు కానీ.. ప్రముఖ హీరో అనలేదు మంచు విష్ణు.. దాంతో మొన్నటి వరకు ఆ ప్రముఖ హీరో చిరంజీవి అనుకున్నారు.. కానీ అందులో ఎలాంటి నిజం లేదని విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. కాకపోతే ఆ ప్రముఖ నటుడు కూడా జూబ్లీహిల్స్ లోనే ఉంటాడని.. త్వరలోనే అతని వివరాలు బయట పెడతాము అంటున్నాడు మంచు విష్ణు. 2 ఐపి అడ్రస్ లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చాడు మంచు విష్ణు.
దాదాపు 27 యూ ట్యూబ్ ఛానల్స్ లిస్ట్ అవుట్ చేసి వాళ్ల పేరు కూడా పోలీసుల ముందు పెట్టాడు. అందరికీ కచ్చితంగా పరువు నష్టం దావా వేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు మంచు విష్ణు. ట్రోలింగ్ అంటే చూసి నవ్వుకునేలా ఉండాలి కానీ.. నవ్వుల పాలు చేసేలా ఉండకూడదు అంటున్నాడు ఈయన. జిన్నా సినిమా ప్రమోషన్ లో భాగంగా బయటికి వస్తున్న మంచి విష్ణు.. ఆ సినిమా ప్రమోషన్ కంటే ఎక్కువగా ట్రోలింగ్ గురించి చర్చించడం కొత్త చర్చకు దారి తీస్తుంది. ఇదిలా ఉంటే దసరా సందర్భంగా అక్టోబర్ 5న జిన్నా విడుదల అవుతుందని గతంలో చెప్పాడు విష్ణు.. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని అక్టోబర్ 21న ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..