జోగులాంబ గద్వాల : ఇంట్లో పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేక ఓ యువతి ఆత్మ హత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయ నర్సింహులు, ఆదిలక్ష్మిల కుమార్తె ప్రియాంకను ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన కిశోర్ కుమార్తో జనవరిలో నిశ్చితార్థం అయింది.
పెండ్లి ఇష్టం లేని ప్రియాంక మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. ప్రియాంకను కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
చికిత్స పొందుతూ ప్రియాంక మరణించింది. సోదరుడు రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సంతోష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
కరోనాతో మేడారం పూజారి భార్య మృతి
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్