చెన్నై: తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ కొవిడ్ టీకా తొలి డోస్ తీసుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరీ ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆయనకు టీకా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజలంతా ముందుకొచ్చి స్వచ్ఛందంగా టీకాలు తీసుకోవాలని కోరారు. కాగా, దేశంలో జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ముందుగా వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో పోలీస్ సిబ్బందికి టీకాలు ప్రారంభించారు. ఈ నెల 1 నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి, 45 ఏండ్లు పైబడిన దీర్ఘకాలిక రోగులకు కరోనా టీకాలు ఇస్తున్నారు.