సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): లక్ష్మీపూజతో మొదలై దీపాల వెలుగులు, పటాకుల శబ్దాల నడుమ భాగ్యనగర వాసులు దీపావళి పండుగను వైభవంగా జరుపుకున్నారు. విభిన్న రకాల వెలుగులతో మహానగరం మిరుమిట్లు గొలిపింది.
అడుగడుగునా రంగురంగుల కాంతులతో తారా జువ్వలు ఆకాశంలోకి దూసుకుపోతుంటే.. పిల్లల నుంచి వృద్ధుల వరకు సందడి చేశారు. పలు ప్రాంతాల్లో మిఠాయి, పూలు, పూజా సామగ్రి దుకాణాలు సందడిగా మారాయి. సూర్య గ్రహణం సందర్భంగా ప్రముఖ ఆలయాలన్నింటిని మూసివేశారు.