పినపాక, ఫిబ్రవరి 24: పినపాక మండలంలో ఇప్పటివరకు 786 మంది లబ్ధిదారులకు రూ.7.20 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం ఆయన పినపాక రైతువేదికలో 89 మంది లబ్ధిదారులకు రూ.89.10 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. కల్యాణలక్ష్మి పథకం సీఎం కేసీఆర్ మానసపుత్రిక అన్నారు. ఈ పథకం దేశంలో కేవలం తెలంగాణలోనే అమలవుతున్నదన్నారు. ఉద్యమ నేతగా కేసీఆర్ నిరుపేదల కష్టాలు తెలుసుకున్నారన్నారు. వారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనూ ఇలాంటి పథకాలు అమలుకావడం లేదన్నారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నదన్నారు. ‘మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయన్నారు. పేద, మధ్యతరగతి పిల్లలకు మెరుగైన విద్య అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ వినయశీల, జడ్పీటీసీ దాట్ల సుభద్రాదేవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ గొగ్గెల నాగేశ్వరరావు, ఎంపీటీసీ సత్యం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సతీశ్రెడ్డి పాల్గొన్నారు.
పినపాక, ఫిబ్రవరి 24: మండల కేంద్రంలోని పీహెచ్సీలో గురువారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆశవర్కర్లకు ప్రభుత్వం సమకూర్చిన స్మార్ట్ఫోన్లు అందజేశారు. కరోనా సమయంలో ఆశవర్కర్లు కష్టపడి పనిచేశారన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం స్మార్ట్ఫోన్లు పంపిణీ చేస్తున్నదన్నారు. మణుగూరు 100 పడకల ఆసుపత్రితోపాటు పినపాక, కరకగూడెం, జానంపేట పీహెచ్సీల్లో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.