అమరావతి : ఏలూరు జిల్లాలో నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవాశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలోని పోతన చెరువులో వినాయక విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేసేందుకు వెళ్లారు.
నిమజ్జన చేసే సమయంలో షేక్ రియాజ్ (25), ఉక్కుర్తి దొరబాబు (45), దొరబాబు కొడు కు కార్తీక్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయారు. అక్కడే ఉన్న స్థానికుడు ఒకరు వెంటనే స్పందించి కార్తీక్ను కాపాడగా పూర్తిగా నీటమునిగిన రియాజ్, దొరబాబులను బయటకు తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్న ఇద్దరిని జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలిచ్చారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రియాజ్ అవివాహితుడు కాగా, దొరబాబుకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.