న్యూఢిల్లీ, మార్చి 6: ఈ నెల 15వ తేదీ నుంచి సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్షంగా జరుగనున్నది. ఇందుకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ను అత్యున్నత న్యాయస్థానం శనివారం విడుదల చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్ విచారణ ప్రక్రియను కొనసాగిస్తూనే, కొన్ని షరతులతో ప్రత్యక్షంగా కూడా కేసుల విచారణ ప్రారంభించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నది. మంగళ, బుధ, గురువారాల్లో విచారణకు వచ్చే కేసులను ప్రత్యక్షంగా విచారిస్తారు. వాటిల్లో తుది విచారణ జరుగుతున్న కేసులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.