హైదరాబాద్ : ట్యాంకర్లలో డీజిల్ కల్తీ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిభట్ల ఓఆర్ఆర్ వద్ద డీజిల్ కల్తీ చేస్తున్న 9 మంది ముఠా సభ్యులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. దుండగులు ట్యాంకర్ల నుంచి డీజిల్ తీసి కిరోసిన్ కలుపుతున్నారు. సంఘటనా స్థలం నుంచి 3 ట్యాంకర్లు, బైక్, 60 లీటర్ల డీజిల్, 9 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.