కోల్కతా: బెంగాల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సీఎం మమత బెనర్జీ సున్నాకు పరిమితమైన వామపక్షీయులపై సానుభూతి ప్రకటించారు. విపక్షంలో వామపక్షాలు ఉండాలని తాను కోరుకుంటానని ఆమె పేర్కొన్నారు. అయితే బీజేపీకి తోడ్పడాలనే అత్యుత్సాహంతో వారు అమ్మడుపోయారని, కేవలం సైన్బోర్డుగా మిగిలారని దీదీ దుయ్యబట్టారు. దీని గురించి వారు ఆలోచించాలని ఆమె సూచించారు. స్వతంత్ర భారత చరిత్రలో 294 స్థానాల బెంగాల్ అసెంబ్లీలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ సభ్యులు లేకపోవడం ఇదే ప్రథమం. గత ఆదివారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దీదీ నేతృ్తంవోలని టీఎంసీకి 213 స్థానాలు, బీజేపీకి 77 స్థానాలు వచ్చాయి. బీజేపీ జోరు చూసిన ముస్లింలు మూకుమ్మడిగా దీదీ పార్టీకి ఓట్లు వేశారు. కాంగ్రెస్ కంచుకోటలైన మాల్డా, ముర్షిదాబాద్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఓటర్లు టీఎంసీ, బీజేపీ గురించే పట్టించుకున్నారు. మిగతా పార్టీల ఊసు మరచిపోయారు.