పాడి పశువుల్లో ‘పాలరోగం’ ప్రమాదకరమైంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు రక్తంలోని కాల్షియం ఆకస్మాత్తుగా తగ్గిపోయి, రక్తప్రసారంలో అంతరాయం కలుగుతుంది. పశువు అపస్మారకస్థితిలోకి చేరి, చివరికి మరణిస్తుంది. పశువుల్లో పోషక లోపం వల్లే ఈ వ్యాధి ప్రబలుతుంది. సకాలంలో చికిత్స అందిస్తే.. పశువులు బతికి బయటపడే అవకాశం ఉంటుంది.
జఫార్ బాడి, జెర్సీ ఆవుల్లో ఈ పాలరోగం ఎక్కువగా కనిపిస్తుంది. పశువులు ఈనిన మొదటివారంలో ఈ వ్యాధి సోకుతుంది. సాధారణంగా ఐదు నుంచి పదేండ్ల వయసున్న పాడిపశువులు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతాయి. ఈ వ్యాధి లక్షణాలు మూడు దశల్లో ఉంటాయి.