విశాఖపట్నం,మే 30: విశాఖపట్నం ఆర్.ఐ.ఎన్.ఎల్ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్లో , ఆక్సిజన్ సరఫరా సదుపాయం కలిగిన 300 పడకల జంబో కోవిడ్ కేర్ కేంద్రాన్ని కేంద్ర పెట్రోలు, సహజవాయు, స్టీలు శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేశారు. ఆర్ ఐఎన్ ఎల్వద్ద కోవిడ్ కేర్సెంటర్ఏర్పాటు,సమాఖ్యవాదానికి గొప్ప ఉదాహరణ అని ప్రధాన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమం, వారి బాగోగులు ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఇందుకు రాష్ట్రప్రభుత్వం , జిల్లా పాలనా యంత్రాంగం మద్దతునిచ్చిందని, దీనితో ప్రధానమంత్రి దార్శనికత అయిన జహన్ బీమార్, వహిన్ ఉపచార్ అన్నది సత్వరం పి.ఎస్.యు అమలు చేయడానికి వీలైందన్నారు. ప్రధానమంత్రి పిలుపుమేరకు మేం స్టీలు ప్లాంట్లకు దగ్గరలోనే ఆక్సిజన్ సరఫరాతో కూడిన జంబో కేర్ సెంటర్ల ఏర్పాటుకు స్టీలు కంపెనీలను సన్నద్ధం చేశాం “అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా జరిగిన వర్చువల్ సమావేశంలో ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్ సింగ్ కులస్తే, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఎ. కాళీకృష్ణ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రలు, వాణిజ్య శాఖ మంత్రి ఎం. గౌతమ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పంచాయతి రాజ్ , గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి పి.రామచంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు, ఎం.ఎల్.ఎలు పాల్గొన్నారు.