హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నేడు రెండో డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ను తీసుకున్నారు. నగరంలోని అంబర్పేట అర్బన్ హెల్త్ సెంటర్లో డీజీపీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ను తీసుకున్నారు. మెడికల్ ఆఫీసర్ గీతారాణి ఆధ్వర్యంలో వాక్సినేషన్ జరిగింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్పై డీజీపీ అక్కడి వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడిచిన ఫిబ్రవరి 6వ తేదీన తిలక్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో డీజీపీ మొదటి డోస్ వ్యాక్సిన్ను తీసుకున్న సంగతి తెలిసిందే.