ములుగు : జిల్లాలోని ములుగు మండలం కొత్తూరు గ్రామంలోని కొండపై కొలువుదీరిన దేవుని గుట్ట ఆలయం నిర్మాణ అద్భుతం అని ఏఎస్పీ పి.సాయి చైతన్య అన్నారు. ఏఎస్పీ హరికృష్ణ, పోలీసు సిబ్బందితో కలిసి సాయి చైతన్య ఆదివారం ఆలయ సందర్శనకు వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవుని గుట్ట ఆలయం కాంబోడియాలోని ప్రపంచ ప్రఖ్యాత అంగ్కోర్ వాట్ ఆలయాన్ని పోలి ఉంటుందన్నారు. ఆలయాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆలయం ఇటుకలతో చేసిన నిర్మాణంగా కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్లి చూడగా బ్లాక్ ఇసుక, రాతి మిశ్రమం కలయిక అన్నారు. దేవుని గుట్ట ఆలయానికి 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంటుందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.