తిరుమల : తిరుమల కొండపై భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, తమిళుల పెరాటసి మాసం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తిరుమలలోని అన్ని కం పార్టు మెంట్లు నిండిపోయాయి. వీరికి 24 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించా రు.
వైకుంఠం-2 , నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోగా శిలాతోరణం వద్దకు భక్తులు సర్వదర్శనం కోసం నిలిచియున్నారు. దర్శన సమయాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు తిరుమలకు రావాలని , కంపార్టు మెంట్లు, క్యూ లైన్లో ఉన్న భక్తుల కోసం తాగునీరు, అల్పహారం,చిన్నపిల్లలకు పాలు అందజేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
వాహనం బేరర్లకు ఒక్కొక్కరికి రూ. 81,500 కానుకగా అందజేత
బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహించిన వాహనం బేరర్లు, మేళం సిబ్బంది, వేదపారాయణదారులు, జియ్యంగార్ల శిష్య బృందం, పారిశుద్ధ్య కార్మికులు మొత్తం 2500 మంది సిబ్బందికి టీటీడీ కానుకలను వస్త్రబహుమానం అందజేశారు. వాహన బేరర్లకు ప్రత్యేకంగా రూ.64.50 లక్షలను వాహనం బేరర్లకు కానుకగా అందించారు. ఒక్కో వాహనం బేరర్ కు రూ.81,500 కానుకగా అందించారు. తొమ్మిది రోజుల పాటు మలయప్ప స్వామి వివిధ వాహనాలపై ఊరేగిన సందర్భంగా వాటిని మోసిన బేరర్లకు కానుకగా అందజేశారు.