ఇటిక్యాల: అమవాస్య (పెత్తర్ల) పర్వదినాన్ని పురష్కరించుకొని బుధవారం బీచుపల్లి క్షేత్రములో భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుంచే విచ్చేసిన భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించిన అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ అమవాస్యకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా పుష్కరఘాట్ చెంత పిండప్రధానాలు చేయడం కోసం గతంలో ఎన్నడు రానంతగా భక్తులు విచ్చేయడం విశేషం. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.