మహిష మస్తక నృత్త వినోదినీ స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జనన రక్షణ మోక్ష విధాయినీ జయతి శుంభనిశుంభ నిషూదినీ॥
లోక కంటకుడైన మహిషాసురుణ్ని సంహారం చేసిన మహోగ్రరూపం ఇది. సకల దేవీదేవతల శక్తులన్నీ ఈ తల్లిలో మూర్తీభవించి ఉంటాయి. దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలు ధరించి, సింహ వాహినియై దర్శనమిస్తుంది. ఈమె అనుగ్రహం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజునే ‘మహర్నవమి’గా జరుపుకోవటం ఆచారంగా వస్తున్నది. ఈ రోజున చండీదేవిని పూజించిన వారికి శత్రుభయం ఉండదు. అన్నిటా విజయం కలుగుతుంది. ఈ రోజు అమ్మవారిని యథాశక్తి పూజించి పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసాన్నం నివేదన చేయాలి. అమ్మవారి స్వరూపంగా సువాసినులకు పూజ చేసి, మంగళద్రవ్యాలు, పసుపు కుంకుమలు, శక్తికొద్దీ నూతన వస్ర్తాలు ఇవ్వాలి.