హోం మంత్రి మహమూద్ అలీ
ఖైరతాబాద్, మార్చి 26 : శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆన్లైన్ వ్యాపార ప్లాట్ ఫాం ‘లివైండ్స్’ వెబ్సైట్, యాప్ను శనివారం సాయంత్రం హోటల్ కత్రియాలో సంస్థ నిర్వాహకులు మీర్ అష్ఫాక్ అలీ ఖాన్, సయ్యద్ హస్సైన్ అబ్బాస్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ అమెజాన్ లాంటి సంస్థలు ఇక్కడ తమ వ్యాపారాలు సాగిస్తున్నాయని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్లు చెప్పారు. అందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ వ్యాపారం విస్తృతంగా సాగుతున్నదని, హైదరాబాద్ వ్యాపార, వాణిజ్య రంగాలకు హబ్గా విరాజిల్లుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, సీఎం కేసీఆర్ శాంతిభద్రతలపై ప్రత్యేక శ్రద్ధ చూపారని, లా అండ్ ఆర్డర్లో దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ ఉన్నదని, ఫలితంగా దేశ, విదేశాల నుంచి పెట్టుబడుల వెల్లువలా వస్తున్నాయన్నారు.