మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. 250కోట్లతో రావిర్యాల గ్రామంలో 32 ఎకరాలలో విజయడెయిరీ నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేస్తున్నవిజయ డెయిరీ ఫాం మన ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందని సబితారెడ్డి అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి దన్యవాదాలు తెలుపుతున్నామని ఆమె అన్నారు.
మన తెలంగాణలో పాల ఉత్పత్తికి డిమాండ్ బాగా ఉందని అన్నారు. రైతులందరూ విజయడైయిరీని ఆధరించి దానిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రతి రైతు విజయడెయిరీకి పాలను అమ్మాలని ఆమె రైతులకు సూచించారు. ఈకార్యక్రమంలో విజయడెయిరీ చైర్మన్ లోక భూపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు సురభివాణిదేవి, యెగ్గెమల్లేశం, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారాజేందర్, కలెక్టర్ అమోయ్కుమార్, విజయడెయిరీ ఎండీ శ్రీనివాసరావు, తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి,కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు వివిద శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.