ఐపీఎల్ 2021 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుడ్న్యూస్. ఆ జట్టు స్టార్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్కు రెండోసారి నిర్వహించిన కొవిడ్ టెస్టులో కరోనా నెగెటివ్గా వచ్చింది. కర్ణాటక బ్యాట్స్మన్కు కరోనా సోకిందని మార్చి 22న నిర్ధారణ కాగా, అప్పటి నుంచి క్వారంటైన్లోనే ఉన్నాడు. బీసీసీఐ కొవిడ్-19 ఎస్ఓపీల ప్రకారం..అతడిని మరికొన్ని రోజులు పర్యవేక్షిస్తూనే ఉంటారు. కాబట్టి, ఏప్రిల్ 9న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్తో సీజన్ ఆరంభ మ్యాచ్కు అతడు దూరంకానున్నాడు.
కొవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం..కరోనా బారిన పడ్డవారు పదిరోజులు ఐసోలేషన్లో ఉండాలి. తొమ్మిది, పదో రోజు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో రెండుసార్లు ఫలితం నెగెటివ్ రావాలి. 24 గంటల దాటిన తర్వాత బయో సెక్యూర్ వాతావరణంలోకి అనుమతిస్తారు. కోలుకున్న తర్వాత జట్టుతో కలవడానికి ముందు ఆటగాడికి తప్పనిసరిగా కార్డియాక్ స్క్రీనింగ్ చేస్తారు.