మహబూబ్నగర్: తక్కువ సమయంలోనే దేశంలో అతి పెద్ద కేసీఆర్ ఏకో అర్భన్ పార్కును మన మహబూబ్నగర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం సమీ పంలోని కేసీఆర్ ఏకో పార్కులో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా ర్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. జిల్లా పర్యాటక రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు.
కేసీఆర్ ఏకో అర్భన్ పార్కు 2087 ఎకరాల్లో ఉందని, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పిల్లలమర్రి, పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ, కురుమూర్తి దేవాలయం, కోయిల్సాగర్ ప్రాజెక్టు, కోయిల్కోండ కోట వంటి ఎన్నో పర్యాటక క్షేత్రాలు కలిగిన జిల్లాగా మహబూబ్నగర్కు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు.
హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న మయూరి పార్కును చూసేందుకు ప్రతి వారం హైదరాబాద్ నుంచి చాలామంది పర్యాటకులు జిల్లాకు విచ్చేస్తున్నారని తెలిపారు. టూరిజం వల్ల ఎంతో ఆదాయం సమకూరడంతో పాటు పలువురికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక సర్యూట్ను రూపొందించి ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ముందుకు సాగాలని సంబంధింత అధికారులను ఆదేశిం చారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమోంటోను అందజేసి సత్కరించారు. శిశు వికాస్ గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి.
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో జిల్లా పర్యాటకంపై ప్రత్యేకంగా రూపొందించి పాడిన పాటలు అందరిని అలరింపజేశాయి. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్పవర్, డీఆర్వో కె. స్వర్ణలత, డీఈవో ఉషారాని, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు.