ప్రారంభ ధర రూ.69,900
న్యూఢిల్లీ, మార్చి 31: దేశీయ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్..మార్కెట్లోకి సరికొత్త ‘డెస్టినీ 125 ఎక్స్టీఈసీ’ స్కూటర్ను పరిచయం చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.69,900గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 125 సీసీ ఇంజిన్ కలిగిన ఈ స్కూటర్ 9 బీహెచ్పీ శక్తినివ్వనున్నది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ స్టాండర్డ్ రకం రూ.69,900గాను, టాపెంట్ మోడల్ రూ.79,990గా నిర్ణయించింది. స్టాప్-స్టార్ట్ సిస్టమ్, యూఎస్బీ చార్జర్, బ్లూటూత్ కనెక్టివిటీతో డిజి అనలాగ్ స్పీడ్మీటర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.