ముంబై: కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వ్యక్తి బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన బాధిత బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ ఘటన జరిగింది. 16 ఏండ్ల బాలిక సవతి తల్లికి చెందిన బంధువు జూన్లో ఆమెను కిడ్నాప్ చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బెంగళూరులో ఉన్న బాలికను పోలీసులు కాపాడారు. కిడ్నాప్, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందుతుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో చార్జ్షీట్ కూడా దాఖలు చేశారు.
కాగా, నిందితుడు ఆగస్ట్ 11న బెయిల్పై విడుదలయ్యాడు. నాటి నుంచి మనస్థాపంతో ఉన్న బాధితురాలు జరిపాట్కా ప్రాంతంలోని తన ఇంట్లో ఉరి వేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకున్నది. దీంతో బాధిత కుటుంబం షాక్ అయ్యింది. అయితే, బెయిల్పై జైలు నుంచి విడుదలైన నిందితుడి నుంచి బాధిత బాలికకు ఎలాంటి బెదిరింపులు లేవని పోలీసులు తెలిపారు. కిడ్నాప్, లైంగిక దాడి కేసు ఫాస్ట్ట్రాక్ కోర్టులో సత్వర విచారణ జరిగేలా చూస్తామని పోలీస్ అధికారి చెప్పారు.