ఒడెన్స్: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. సుదీర్ఘ విరామం అనంతరం కోర్టులో అడుగుపెట్టనుంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల్యూఎఫ్ సూపర్-100 టోర్నీ డెన్మార్క్ ఓపెన్లో సింధు బరిలోకి దిగనుంది. నాలుగో సీడ్ సింధు తొలి రౌండ్లో నెస్లిహన్ ఇగిట్ (టర్కీ)తో తలపడనుంది. మరోవైపు ఉబెర్ కప్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి గాయం కారణంగా తప్పుకున్న సైనా నెహ్వాల్ కూడా ఈ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మొదటి రౌండ్లో అయా ఒహోరి (జపాన్)తో సైనా అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం ఏడో సీడ్గా బరిలోకి దిగనుండగా.. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్, లక్ష్యసేన్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ పోటీ పడనున్నారు. మహిళల డబుల్స్లో తెలంగాణ షట్లర్ ఎన్ సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప, మేఘన-పూర్విషా జోడీలు బరిలో ఉన్నాయి.