ముంబై, సెప్టెంబర్ 5: వరుసగా రెండేండ్లుగా డౌన్ట్రెండ్లో కొనసాగిన కమర్షియల్ వాహనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉన్నదని టాటా మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరిష్ వాగ్ తెలిపారు. మార్కెట్లోకి సీఎన్జీ మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలను విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కరోనాతో గత రెండేండ్లుగా కమర్షియల్ వాహనాలకు డిమాండ్ పడిపోయిందని, మళ్లీ ఇప్పుడిప్పుడే విక్రయాలు పుంజుకుంటున్నాయన్నారు.