న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శిరోమణి అకాలీదళ్ నిరసన ర్యాలీ నేపథ్యంలో అక్కడి పోలీసులు పలుమార్గాల్లో ట్రాఫిక్ను దారి మళ్లించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ శిరోమణి అకాలీదళ్ భారీ ర్యాలీ నిర్వహించతలపెట్టింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్ గురువారం తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ నుంచి పార్లమెంట్ హౌస్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగనుంది.
ర్యాలీలో పాల్గొనడం శిరోమణి అకాలీదళ్ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే భారీ సంఖ్యలో గురుద్వారా రకబ్ గంజ్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఢిల్లీ పోలీసులు ర్యాలీ కొనసాగనున్న మార్గాల్లో ట్రాఫిక్ను దారి మళ్లించారు. ర్యాలీ కారణంగా గురుద్వారా రకబ్ గంజ్ రోడ్డు, ఆర్ఎంఎల్ ఆస్పత్రి, జీపీవో, అశోకా రోడ్, బాబా ఖరక్సింగ్ మార్గ్ రద్దీగా ఉంటాయని, ఆయా మార్గాల్లో వెళ్లాల్సిన వాహనదారులు ఇవాళ ప్రత్నామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.