Monkeypox | దేశ రాజధాని ఢిల్లీలో రెండో మంకీ పాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో నివసిస్తున్న నైజీరియన్ (35) మంకీ పాక్స్ భారీన పడ్డాడు. ఇటీవల అతడు విదేశీ ప్రయాణాలేమీ చేయలేదు. దీంతో దేశంలో మంకీ పాక్స్ బారీన పడ్డ వారి సంఖ్య ఆరుగురికి చేరుకున్నదని సోమవారం కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.
సదరు నైజీరియన్.. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ దవాఖాన ఎల్ఎన్జేపీ దవాఖానలో చికిత్స కోసం చేరాడు. గత ఐదు రోజులుగా జ్వరం, బొబ్బలతో బాధపడుతున్నాడు. అతని వద్ద నుంచి సేకరించిన రక్త నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపారు.
అతడికి మంకీ పాక్స్ సోకినట్లు సోమవారం సమాచారం వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. ఆఫ్రికా ఖండ సంతతికి చెందిన మరో ఇద్దరు అనుమానిత రోగులు కూడా ఎల్ఎన్జేపీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వారికి కూడా మంకీ పాక్స్ సోకి ఉండొచ్చునని భావిస్తున్నారు.