న్యూఢిల్లీ: కోర్టు ధిక్కారం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపాలంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంగళవారం నాటి విచారణ సందర్భంగా కోర్టు కేంద్రంపై మరోసారి మండిపడింది. ఆక్సిజన్ పంపిణీలో కేంద్రం కన్నా ఐఐటీలు, ఐఐఎంలు సమర్థంగా పనిచేయగలవని పేర్కొన్నది. దేశంలో తీవ్రమైని కరోనా సంక్షేభం దృష్ట్యా సైన్యాన్ని రంగంలోకి దింపే విషయంలో కేంద్రం రూపొందించిన ప్రణాళికలు ఏవని నిలదీసింది. తగినంత ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయని ఢిల్లీ సర్కారు కోర్టుకు లెక్కలు వివరించింది. పంపిణీకి వాటిని సరిగా వినియోగించడం లేదని తెలిపింది. ట్యాంకర్ల సామర్త్యం కన్నా మూడోవంతు మాత్రమే సరఫరా చేస్తున్నారని చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వ లెక్కలపై కేంద్ర సర్కారు న్యాయవాది అభ్యంతరం తెలుపగా కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ చూపిన లెక్కలను వాగాడంబరంగా కేంద్ర ప్రబుత్వ న్యాయవాది అభివర్ణించడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఇంత నిర్గయగా ఎలా ఉండగలరని నిలదీసింది. కేంద్రాన్ని ఉద్దేశించి కోర్టు సైన్యాన్ని రంగంలోకి దింపడం విషయమై నిశ ితంగా ప్రశ్నించింది. మీరు చేస్తున్నది మీరు చేస్తున్నారు. కానీ కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మీమీద ఉంది.. ఒకవేళ సైన్యాన్ని ఉపయోగించడం ఇష్టం లేకపోతే మీ దగ్గరున్న ఇతర మార్గాలేమిటో చెప్పండి అని నిలదీసింది. ఉన్నత స్థాయిలో ఈ అంశం పరిశీలనలో ఉందన్న న్యాయవాది సూచనను న్యాయస్థానం కొట్టిపారేసింది. 48 గంటలు గడితిన తర్వాత ఇంకా పరిశీలన ఏమిటి అని చురకలు వేసింది.