న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు.
సోమవారం ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన మాట్లాడుతూ మొత్తం దేశంలో పాఠశాల విద్య, ఆరోగ్య పరిరక్షణను ఐదేండ్లలో మెరుగుపరచవచ్చని అన్నారు. పౌరులకు మంచి విద్య, ఆరోగ్య రక్షణ కల్పించడం ద్వారానే ఒక దేశం ధనికంగా, అగ్రగామిగా మారుతుందని, ఇందుకు అమెరికా, కెనడా, జర్మనీ వంటి దేశాలే ఉదాహరణ అని అన్నారు.