వీణవంక : దేశాన్ని కార్పోరేట్ సంస్థలకు తాకట్టుపెట్టి ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీ పార్టీని ఈ నెల 30న జరిగే హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడించాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు పిలు పునిచ్చారు. మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా విద్యార్థి సంఘాల ప్రతినిధులు, వ్యవసాయకార్మిక సంఘాల నాయకులతో పొలాడి రామారావు నియోజకవర్గ స్థాయి సమావేశమయ్యారు
ఈ సందర్భంగా పొలాడి రామారావు మాట్లాడుతూ దేశానికి ఆయువుపట్టయిన ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, ఎల్ఐసీ, బ్యాంకింగ్, ఎయిర్లైన్స్, రక్షణ, బొగ్గుగనులు, స్టీల్ ఫాక్టరీలు తదితర 33 ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ల చేతిలో తాకట్టుపెట్టి రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు.
నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతుల ఆత్మగౌరవాన్ని మంటగలిపిందని, మరో పక్క పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకున్నా పట్టించుకోని బీజేపీ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని సూచించారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల సాకారం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువస్తున్నారన్నారు.
పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అండగా ఉండాలని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ఎడ్ల లక్ష్మారెడ్డి, వేల్పుల శ్రీనివాస్, గురం వెంకటేశ్వర్లు, దాట్ల రవీందర్, బోగం దశరథం, కొలుగూరి రాజేశ్వర్రావు, ఆకిన సదాశివరెడ్డి, ఆంజనేయులు, భాస్కర్, రాజిరెడ్డి, మధుసూదన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.