కార్తిక్రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘ధీర్ఘాయుష్మాన్భవ’. పూర్ణానంద మిన్నకూరి దర్శకుడు. ప్రతిమ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ ‘సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. తన ప్రేమ కోసం యముడితో ఓ యువకుడు ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో నటించిన చిత్రమిది. త్వరలో విడుదలతేదీని వెల్లడిస్తాం’ అని తెలిపారు. నోయల్, ఆమని, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: మల్హార్ భట్ జోషి.